కోనసీమ: చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్రెడ్డి దారుణ హత్యను కొత్తపేటకు చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్యాల బాబ్జి, మండల అధ్యక్షుడు గనిశెట్టి వీరేష్ తదితర నాయకులు మంగళవారం తీవ్రంగా ఖండించారు. హంతకులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దురాగతాలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.