ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వాణి మాట్లాడుతూ.. ఉదయం 8 గంటల నుంచి ఈ హుండీ లెక్కింపు ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు సందర్భంగా ఆలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.