KDP: సింహాద్రిపురంలోని ఎల్లనూరు క్రాసింగ్ వద్ద సోమవారం సాయంత్రం SI రవికుమార్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వాహన రికార్డులు, లైసెన్సులు లేని వాహనాల యజమానులకు జరిమానా విధించారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. వాహనాలు ఇవ్వకుండా, నడపకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.