E.G: రాజమండ్రిని పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.270 కోట్లతో అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నట్లు MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం ప్రకటించారు. నగరంలోని ప్రధాన సమస్య అయిన ముంపు నివారణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా నగరంలోని మేజర్ డ్రైనేజీల్లోని సిల్టును పూర్తిస్థాయిలో తొలగిస్తున్నామన్నారు.