CTR: వీ.కోట మండలంలోని నాయకనేరి అటవీ ప్రాంతంలోని పురాతన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, చౌడేశ్వరి దేవి ఆలయ ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాలకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మొదట శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొని స్వామి వారిని వేడుకున్నారు.