W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. ఇళ్ల వద్ద పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని, తద్వారా విషజ్వరాల బారిన పడకుండా గ్రామాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.