KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి భవిత వికలాంగుల పాఠశాల నందు మంగళవారం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఇర్ఫాన్ భాషా ఆధ్వర్యంలో పాఠశాల పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం పిల్లలందరికీ పండ్లు పంపిణీ చేశారు.