CTR: గూడూరు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ ఛైర్మన్ వంకి పెంచలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిశంకర కళాశాల ఏర్పాటు చేసి 26 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల డ్రీమ్డ్ యూనివర్సిటీగా మారిందని తెలిపారు. డీమ్డ్ యూనివర్సిటీగా మారిన నేపథ్యంలో చదువులో మెరిట్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.