ATP: రంజాన్ మాసం ఆఖరి జుమా సందర్భంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మసీదు ఇమామ్ సాబ్ హుస్సేన్ ఉపవాసం, దానధర్మాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పవిత్ర మాసంలో చేసే నమాజ్, సత్కార్యాలకు అధిక పుణ్యం లభిస్తుందని వివరించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.