KDP: కాజీపేట గ్రామ పంచాయతీలోని టీచర్స్ కాలనీలో రోడ్డుపై వర్షపు నీరు నిలుస్తుందని కాలనీ వాసులు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ విషయం తెలుసుకొన్న ఎంపీడీవో టీచర్స్ కాలనీని మంగళవారం సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యపై స్పందించిన ఎంపీడీవోకు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.