NLR: జిల్లాలో రెండో పంటగా పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీలో కోరారు. 3 లక్షల ఎకరాల్లో 9 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందన్నారు