W.G: ఉండి మండలంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు ఇవాళ పర్యటించారు. గ్రామంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన కిట్టమ్మ చెరువు వద్ద మైక్రో ఫిల్టర్ బెడ్, సంత మార్కెట్లోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్ బెడ్ను ఆయన ప్రారంభించారు.