అన్నమయ్య: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో 31వ వార్డు అనే విధాల అభివృద్ధి చెందుతుందని టీడీపీ ఇంఛార్జ్ తమ్మిశెట్టి రామకృష్ణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 35 లక్షల రూపాయలతో మురుగునీటి కాలువలు నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రజల మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే అన్ని విధాల కృషి చేస్తున్నారని చెప్పారు. నిర్మాణ పనులను ఆయన ఇవాళ పరిశీలించారు.