PLD: తుఫాను ప్రభావంతో ఇవాళ రాత్రి నుంచి పట్టణంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలకలూరిపేట పురపాలక సంఘం కీలక విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కమిషనర్ శ్రీహరి బాబు కోరారు. విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సుగాలీ కాలనీ, ఆర్వీఎస్ హైస్కూల్ వంటి పునరావాస కేంద్రాలకు తరలింపుకు సిద్ధంగా ఉండాలన్నారు.