ప్రకాశం: దర్శిలో నవంబర్ 8, 9వ తేదీల్లో ప్రకాశం జిల్లా సీఐటీయూ 13వ మహాసభలు జరుగుతాయని జిల్లా నాయకుడు మాలకొండయ్య తెలిపారు. ఆదివారం వెలిగండ్లలో మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శిలో జరుగుతున్న ఈ మహాసభలో వేలాదిమంది కార్మిక ఉద్యోగులతో మహాప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. కావున కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.