విశాఖలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ ఆవిర్భవించిందని ఛైర్మన్ వడ్డాది ఉదయకుమార్ తెలిపారు. శనివారం సుజాతనగర్ ట్రస్ట్ కార్యలయంలో మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక భద్రత లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తుందన్నారు. అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని చెప్పారు. సభ్యత్వానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.