KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఆదివారం భక్తుల రద్దీ నేపథ్యంలో సీఐ రామాంజులు ఆధ్వర్యంలో మంత్రాలయం, మాధవరం ఎస్సైలు శివాంజల్, విజయకుమార్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీ మఠం అధికారులు, పోలీసులు సంయుక్తంగా దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మైకుల ద్వారా తగు సలహాలు, సూచనలు చేశారు.