SKLM: ఎంపీ రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మంగళవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మందస పాతపట్నం స్టేషన్లలో పలు రైళ్లు నిలుపుదల కల్పించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.