VZM: కొత్తవలస మండలం గులి విందాడలో శ్రీ రాముల వారి ఆలయ నిర్మాణాన్ని ఎండోమెంట్ నిధులతో నిర్మించినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వై వి రమణి పేర్కొన్నారు. ఆలయ నిర్మాణాన్ని బుధవారం ఆమె పరిశీలించి, స్ధానిక విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ సర్వ శ్రేయోనిధులు రూ.32 లక్షలు, కాంట్రిబ్యూషన్ రూ.8 లక్షలు, స్థానికుల సమన్వయంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.