VZM: గత 40 రోజులుగా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ఇవాళ ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి TDP రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధులను అభినందించారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు.