NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ళలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 13వ తేదీ జరుగనున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 12 గం.ల వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గం.ల వరకు పరీక్ష నిర్వహిస్తామన్నారు.