TPT: ఏర్పేడు మండల కేంద్రంలో ఇవాళ వైసీపీ మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్ అన్నదాత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు అన్నదాత పోరుబాట కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.