PLD: మండల పరిధిలోని అనంతరం, దొడ్లేరు, ఆవులవారిపాలెం వెళ్లే ప్రయాణికులు దుమ్ము ధూళితో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు వేస్తున్న డబుల్ రోడ్డు పనులు జరగుతుండడంతో రోడ్డుపై దుమ్ము ధూళి అధికంగా లేస్తోందన్నారు. బస్సులు, లారీలు వెళ్లేటప్పుడు వచ్చే దుమ్ముతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.