ASR: రాజవొమ్మంగి మండలం అప్పలరాజుపేటలో అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడిన రక్షిత మంచినీటి పథకం పనులు ఆదివారం మొదలయ్యాయి. సర్పంచ్ రమణి, ఎంపీటీసీ పెద్దిరాజు చొరవతో బోరు, మోటారు, పైప్లైన్ మరమ్మతులు చేపట్టారు. దీంతో త్వరలో గ్రామంలోని ఇళ్లకు, పశువుల తొట్టెకు తాగునీరు అందుబాటులోకి రానుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.