PPM: పార్వతీపురం టీడీపీ నాయకులు స్పీకర్ అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. రాయఘడ మజ్జి గౌరమ్మ దర్శనానికి వెళుతున్న స్పీకర్ను పార్వతీపురంలో టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, పట్టణ అధ్యక్షులు రవికుమార్, మాజీ మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ రెడ్డి శ్రీనివాసరావు, భానుప్రసాద్ తదితరులు కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానం పలికారు.