CTR: పుంగనూరు పురపాలక కార్యాలయ ఆవరణంలో సోమవారం మెప్మా బజారును ఏర్పాటు చేశారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి దీనిని ప్రారంభించారు. మహిళ సంఘ సభ్యులు సొంతంగా తయారు చేసిన బ్యాగులు, దుస్తులు ఇలా వివిధ రకాల తినుబండారాలను కమిషనర్ పరిశీలించారు. మహిళలు తమ చేతివృత్తుల ఉత్పత్తులను విక్రయించడానికి, ఆర్థికంగా ఎదగడానికి మెప్మా బజార్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.