పల్నాడు: జిల్లా పోలీస్ శాఖ వాడిన పాత వాహన పరికరాలను వేలం ద్వారా విక్రయించనుంది. గురువారం ఉదయం 10:30 గంటలకు నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం జరుగనుంది. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆసక్తి ఉన్నవారిని అధికారులు ఆహ్వానిస్తున్నారు.