KRNL: ఆదోనిలో వంట గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ నేతలు ఆదివారం విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే రూ.60 పెంపు చేయడం ప్రజలపై భారం మోపినట్లేనని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దిలీప్ ధోక తెలిపారు. 21 రోజుల ముందే బుకింగ్ నిబంధన ప్రజలకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.