TPT: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పొగాకు రహిత సమాజ స్థాపనకై, పొగాకు నిర్మూలన కోసం అందరితో ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు.