E.G: మండపేట మండలం కేశవరంకు చెందిన వైసీపీ నాయకులు దూలం వెంకన్న బాబును రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా ఆ పార్టీ నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శనివారం వైసీపీ పార్టీ విడుదల చేసింది. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ గెలుపులో భాగస్వామి అవుతానని వెంకన్న బాబు స్పష్టం చేశారు.