NRL: నెల్లూరు జిల్లా, వాకాడు మండలం, బాలిరెడ్డి పాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో మంగళవారం ధనుర్మాస సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తొలి రోజు పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా మాజీ సొసైటీ ఛైర్మన్ కొడవలూరు దామోదరరెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.