PLD: యడ్లపాడు మండలంలో గురువారం పేకాట ఆడుతున్న గ్యాంగ్పై ఎడ్లపాడు పోలీసులు దాడి చేపట్టారు. లింగారావుపాలెం శివారులో పేకాటలో ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10,240 నగదు స్వాధీనం చేశారు. ఘటనపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. స్థానికంగా జూదం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి దాడులు కొనసాగుతాయని తెలిపారు.