W.G: ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్ (66) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేసిన రాజగోపాల్ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. రాజగోపాల్ కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.