E.G: సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారుల కుటుంబాలకు అందజేశారు. టౌన్కు చెందిన నరాకుల నరసింహ స్వామికి రూ.30,786, పాపాయమ్మకు రూ.57,205, రామకృష్ణకు రూ.27,493, భాస్కరరావుకు రూ.1,27,786, జయశ్రీకి రూ.28,409 చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.2,71,680 మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.