GNTR: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయంలో దేవీ శరన్నవరాత్రి సందర్భంగా ఆస్థాన మండపంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం రాజ్యలక్ష్మీ అమ్మవారు విజయలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. కైంకర్య పరులుగా జే. శ్రీధర్, గంగా శంకర్లు వ్యవహరించారు. ఈవో కోగంటి సునీల్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.