కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఎంపీలు భూపతి వర్మ, వల్లభనేని బాలశౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.