E.G: రాజ్యాగ దినోత్సవం సందర్బంగా బుధవారం నిడదవోలులోని B.R అంబేద్కర్ విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్, కొవ్వూరు ఎమ్మెల్యే, ముప్పిడి వెంకటేశ్వరరావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని వారు కొనియాడారు. అనంతరం నిడదవోలు పురపాలక సంఘం వజ్రోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.