BPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాకు చెందిన మాచవరపు రవి కుమార్ను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమించారు. షేక్ పర్వేజ్ను రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఎమానుయేల్ రెబ్బాను రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకాలను పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటించింది.