కృష్ణా: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బందరు బోనాంజా షాపింగ్ ఫెస్టివల్ను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం ప్రారంభించారు. వారం రోజులపాటు నిర్వహించే ఈ ఫెస్టివల్లో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించనున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.