CTR: ప్రభుత్వం మారినా ఆర్టీసీ తీరు మారడం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సుల పనితీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. చిత్తూరు-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కుప్పం బస్టాండ్ వద్ద స్టార్ట్ కాక మొరాయించడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ముందుకు నెట్టారు.