W.G: భీమవరం సోమేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి 19.5కేజీల వెండి మకర తోరణం అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. సోమేశ్వరాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు శుక్రవారం ఎమ్మెల్యే అంజిబాబును కలిసి మకర తోరణ వివరాలను తెలిపారు. ఈనెల 12 ఉదయం 11.30 గంటలకు అమ్మవారికి మకర తోరణం అలంకరిస్తామన్నారు.