ASR: మొంథా తుఫాను వల్ల పాడేరు డివిజన్ పరిధిలో 89 గ్రామాలు, రంపచోడవరం డివిజన్లో 11, చింతూరు డివిజన్లో 46 గ్రామాలు ప్రభావితం అవుతాయని కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం తెలిపారు. పాడేరు డివిజన్లో 56, రంపచోడవరం డివిజన్లో 11, చింతూరు డివిజన్ పరిధిలో 10పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పడిపోయిన చెట్లు, స్థంభాలు తొలగించేందుకు జేసీబీలు సిద్ధంగా ఉంచామన్నారు