ప్రకాశం: చీమకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మొంథా తుపానుపై మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనునట్లు తహసీల్దార్ బ్రహ్మయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ పాల్గొంటారని ఆయన తెలిపారు. జరగబోయే సమావేశానికి మండల స్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.