నెల్లూరు జిల్లాలో అభివృద్ధే తమ ఎజెండాగా పని చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ గురువారం రాత్రి తెలిపారు. ఎనిమిదవ డివిజన్లో రూ.85 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు పార్కును ఆయన ప్రారంభించారు. నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధికి రూ.850 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు.