AKP: కోటవురట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఛైర్మన్ వేచలపు జనార్ధన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొంటున్నట్లు తెలిపారు. పంట రుణాలు, సొసైటీ అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.