CTR: వెదురుకుప్పం మండలం టీకేఎంపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శనివారం ఉదయం మొదలైంది. ముఖ్య అతిథిగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ హాజరయ్యారు. లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా నగదు అందజేశారు. చెప్పిన మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. ఎంపీడీవో పురుషోత్తం, తహశీల్దార్ బాబు, తదితరులు పాల్గొన్నారు.