PLD: చిలకలూరిపేట పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్ శ్రీహరిబాబు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. కళా మందిర సెంటర్, ఆర్యవైశ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 1, 2వ డివిజన్ల పరిధిలోని వివిధ గార్బేజ్ల వద్ద చెత్త సేకరణ ఆలస్యం కాకుండా పారిశుధ్య పనులు త్వరగా జరిగేలా చూడాలని కార్మికులకు ఆదేశించారు.