BPT: భట్టిప్రోలు సాగునీటి వినియోగదారుల సంఘం డైరెక్టర్గా భట్టిప్రోలుకు చెందిన కుంచె వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన భట్టిప్రోలు సాగునీటి సంఘం టీ.సీ-5కు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. మరొక వ్యక్తి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.