ATP: న్యూఢిల్లీలో కేంద్ర ట్రైబల్ మంత్రి జువల్ ఓరంను మంగళవారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. వాల్మీకులు, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు, బోయలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.