VSP: యువతలో పోటీ తత్వాన్ని పెంపొందించేందుకు క్విజ్ పోటీలు దోహదపడతాయని అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు పేర్కొన్నారు. విశాఖ పుస్తక మహోత్సవంలో భాగంగా శనివారం టర్నర్స్ చౌల్ట్రీ వద్ద విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. భారత రాజ్యాంగం ప్రధాన అంశంగా పోటీలు జరిగాయి. నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ఏడు గ్రూపులుగా పోటీల్లో పాల్గొన్నారు.